దేశంలో 200కు చేరిన Omicron కేసులు

ABN , First Publish Date - 2021-12-21T17:44:04+05:30 IST

భారతదేశంలో ఇప్పటివరకు 200 మంది రోగులు ఒమైక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది...

దేశంలో 200కు చేరిన Omicron కేసులు

న్యూఢిల్లీ : భారతదేశంలో ఇప్పటివరకు 200 మంది రోగులు ఒమైక్రాన్ వేరియంట్ కరోనావైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది. ఒమైక్రాన్ వేరియెంట్ సోకిన వారిలో 77 మంది రోగులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.మహారాష్ట్ర, ఢిల్లీలలో 54 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదవగా, తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్‌లో 18, కేరళలో 15, గుజరాత్‌లో 14 కేసులు నమోదయ్యాయి.భారతదేశంలో 5,326 కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యాయి. మొత్తం కొవిడ్ -19 కేసుల సంఖ్య 3,47,52,164 కు చేరుకుంది, అయితే కరోనా క్రియాశీల కేసులు 79,097 కి తగ్గాయి. ఒడిశాలోనూ మొట్టమొదటిసారి రెండు ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. నైజీరియా, ఖతార్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా ఒమైక్రాన్ సోకింది. తాజాగా 453 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 4,78,007 కు చేరింది.


Updated Date - 2021-12-21T17:44:04+05:30 IST