రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి
ABN , First Publish Date - 2021-03-03T04:37:24+05:30 IST
దుంపలగట్టు, సంజీవనగరం మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి చెందాయి.
ఖాజీపేట, మార్చి 2: దుంపలగట్టు, సంజీవనగరం మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి చెందాయి. కడప-కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న జింకలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అవి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. వీటిని స్థానికులు గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన జింకలకు పశువైద్యాధికారి సురేష్రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు.