రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి

ABN , First Publish Date - 2021-03-03T04:37:24+05:30 IST

దుంపలగట్టు, సంజీవనగరం మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి చెందాయి.

రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి
మృతి చెందిన జింక

ఖాజీపేట, మార్చి 2: దుంపలగట్టు, సంజీవనగరం మధ్యలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు జింకలు మృతి చెందాయి. కడప-కర్నూలు జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న జింకలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అవి రెండూ అక్కడికక్కడే మృతి చెందాయి. వీటిని స్థానికులు గుర్తించి అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. మృతి చెందిన జింకలకు పశువైద్యాధికారి సురేష్‌రెడ్డి పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2021-03-03T04:37:24+05:30 IST