నేపాల్‌లో భారీ వర్షాలు...22 మంది మ‌ృతి

ABN , First Publish Date - 2020-07-11T14:31:28+05:30 IST

నేపాల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో 22 మంది మరణించారు.....

నేపాల్‌లో భారీ వర్షాలు...22 మంది మ‌ృతి

ఖాట్మండు (నేపాల్): నేపాల్ దేశంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో 22 మంది మరణించారు. నేపాల్ దేశంలోని కస్కీ జిల్లాలో భారీవర్షాల వల్ల ముగ్గురు పిల్లలతోసహా ఏడుగురు మరణించారు. పోఖారా జిల్లా సారంగకాట్ ప్రాంతంలో వర్షాలకు ఇల్లు కూలిపోయి ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మరో 10 మంది గాయపడటంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. లాంజంగ్ జిల్లాలో ముగ్గురు, రుకుం జిల్లా అత్ బిస్కట్ ప్రాంతంలో ఇద్దరు మరణించారు. జాజర్ కోట్ జిల్లాలో 12 మంది గల్లంతయ్యారు. భారీవర్షాల వల్ల నారాయణితో పాటు పలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. 

Updated Date - 2020-07-11T14:31:28+05:30 IST