బీహార్ గవర్నరు హౌస్లో 20మంది ఉద్యోగులకు కరోనా
ABN , First Publish Date - 2020-07-16T14:57:20+05:30 IST
బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ హౌస్లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది....
పట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ హౌస్లో పనిచేస్తున్న 20 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలింది. బీహార్ రాష్ట్ర గవర్నరు హౌస్ లో 20 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని బీహార్ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. అంతకు ముందు బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు బెట్టయ్య, ఎంపీ సంజయ్ జైస్వాల్, ఎంపీ భార్య, తల్లికి కరోనా వైరస్ సోకింది. వీరితోపాటు పలువురు బీజేపీ నాయకులకు కరోనా పాజిటివ్ అని తేలింది. బీహార్ రాష్ట్రంలో 19,284 కరోనా కేసులు నమోదైనాయి.