ట్విటర్‌కు ఝలకిచ్చిన టర్కీ..!

ABN , First Publish Date - 2021-01-20T01:51:57+05:30 IST

ట్విటర్‌కు టర్కీ భారీ ఝలకిచ్చింది. ఇకపై ఎటువంటి ప్రకటనలు తీసుకోవద్దంటూ నిషేధం విధించింది. టర్కీ ఇటీవల తెచ్చిన కొత్త చట్టాన్ని అమలు చేయడంలో ట్విటర్ విఫలమైందని భావించిన ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ట్విటర్‌కు ఝలకిచ్చిన టర్కీ..!

అంకారా: ట్విటర్‌కు టర్కీ భారీ ఝలకిచ్చింది. ఇకపై ఎటువంటి ప్రకటనలు తీసుకోవద్దంటూ నిషేధం విధించింది. టర్కీ ఇటీవల తెచ్చిన కొత్త చట్టాన్ని అమలు చేయడంలో ట్విటర్ విఫలమైందని భావించిన ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్‌తో పాటు దాని పింటెరెస్ట్, పెరిస్కోప్‌కు కూడా ఈ నిషేధం వర్తించనుంది. టర్కీలోకి కొత్త సోషల్ మీడియా చట్టం ప్రకారం.. సామాజిక మాధ్యమాలన్నీ స్థానికుడైన ఓ ప్రతినిధిని నియమించుకోవాల్సి ఉంటుంది. విషపు ప్రచారంగా ప్రభుత్వం పేర్కొన్న ట్వీట్లను అన్నింటినీ ఈ ప్రతినిధి తొలగించాలి. అయితే..ఫేస్‌బుక్  కొత్త నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ ట్విటర్ మాత్రం తాత్సారం చేస్తుండటంతో టర్కీ ప్రభుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై ప్రకటనల నిషేధం పడింది. 


ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్, యూట్యూబ్ ,ట్విటర్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి భారీ జరిమానాలు చెల్లించుకున్నాయి.  టర్కీలో ఎధేచ్చగా చట్ట ఉల్లంఘలనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా టర్కీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. అయితే..ప్రజావ్యతిరేకతను తొక్కిపట్టేందుకు టర్కీ ప్రభుత్వం ఇటువంటి  వైఖరి అవలంబిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానమీడియాను కట్టడి చేయడంలో సఫలీకృతం అయిన ప్రభుత్వం ప్రస్తుతం సోషల్ మీడియాను టార్గెట్ చేసుకుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-01-20T01:51:57+05:30 IST