తిరునాళ్లలో టీడీపీ నేతల సందడి

ABN , First Publish Date - 2022-08-08T02:42:00+05:30 IST

మండలంలోని కొండముడుసుపాలెం అంకమ్మ తిరునాళ్ల సందర్భంగా ఆదివారం గ్రామంలో టీడీపీ నాయకులు సందడి చేశా

తిరునాళ్లలో టీడీపీ నేతల సందడి
తమ అనుచరుల ఇళ్లలో విందుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, ఇంటూరి రాజేష్‌ తదితరులు

కందుకూరు, ఆగస్టు 7: మండలంలోని కొండముడుసుపాలెం అంకమ్మ తిరునాళ్ల సందర్భంగా ఆదివారం గ్రామంలో టీడీపీ నాయకులు సందడి చేశారు. ఆరు విద్యుత్‌ ప్రభలను ఏర్పాటుచేసి శని, ఆదివారాలలో పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.  ఆదివారం ఇంటింటా విందులు ఏర్పాటుచేసి బంధువులు, స్నేహితులను ఆహ్వానించటంతో  గ్రామంలో  సందడి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఉదయం 11 అంకమ్మను దర్శించుకుని పూజలు చేశారు.  టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి వారి విందులను స్వీకరించారు. అలాగే నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, యువనేత ఇంటూరి రాజేష్‌లు తమ ఆత్మీయుల ఆహ్వానాల మేరకు విందుల్లో పాల్గొన్నారు.

----------


Updated Date - 2022-08-08T02:42:00+05:30 IST