నిర్మాణ భవనాలను పరిశీలించిన తులసిరెడ్డి
ABN , First Publish Date - 2022-06-30T05:47:09+05:30 IST
మండల కేంద్రంలో నిర్మాణం తుది దశలో ఉన్న హైస్కూల్ భవనాలు, పార్కును పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి బుధవారం పరిశీలించా రు.
వేంపల్లె, జూన్ 29: మండల కేంద్రంలో నిర్మాణం తుది దశలో ఉన్న హైస్కూల్ భవనాలు, పార్కును పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి బుధవారం పరిశీలించా రు. పాడా, నాబార్డ్ కింద జిల్లా పరిషత్ బాలికో న్నత పాఠశాలకు రూ.7.80 కోట్లు, జిల్లా పరిషత్ బాలుర ఉన్న త పాఠశాలకు రూ.7కోట్లు, పార్కుకు రూ.3కోట్లు నిధులు మంజూరయ్యాయని అధి కారులు తులసిరెడ్డికి తెలియజేశారు. జూలై 5న పాఠశాలలు తెరిచేలోపు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. ప్రస్తుతం బాలురకు, బాలికలకు ఆటస్థలం ఒకటిగానే ఉందని, దీంతో ఇబ్బందులు వస్తాయని వేర్వేరు ఆటస్థలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో ఏపీఈ డబ్ల్యూఐడీసీ ఎస్ఈ నాగేశ్వరరావు, డీఈ కుమార్, ఏఈ కుమార్, కాంట్రాక్టర్ భాస్కర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ, ఉత్తన్న, శివ, సుబ్బు, వెంకటేశ్, రఫి తదితరులు పాల్గొన్నారు.