మోదీ పర్యటనను అడ్డుకోవాలి
ABN , First Publish Date - 2022-06-29T06:10:03+05:30 IST
మోదీ పర్యటనను అడ్డుకోవాలి
వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీ రవీంద్రబాబు
కాళ్ల, జూన్ 28 : విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ పేరిట అమ్మేసుకున్న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను అడ్డుకో వాలని వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పిలుపునిచ్చారు. మండలంలోని పెద అమిరంలో మంగళవారం వైసీపీ నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడా రు. హోదాను విస్మరించిన బీజేపీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ జత కట్టి రాష్ట్రంలో ఎలా తిరుగుతారని ప్రశ్నించా రు. ఇంత అన్యాయం చేసిన బీజేపీకి రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కు లేదన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వచ్చే నెల 4న వస్తున్న ప్రధానిని ప్రత్యక్షంగా అడ్డుకోలేకపోయినా కనీసం నల్ల బ్యాడ్జీలు ధరించైనా నిరసన తెలపాలన్నారు. ఎమ్మెల్సీ వ్యాఖ్యలపై వేదికపై ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, డీసీసీబీ ఛైర్మన్ పీవీఎల్ నరసింహరాజు తదితరులు విస్మయానికి గురయ్యారు.