చైనా ఆగ్రహం: భారత్‌కు ఆహ్వానమా.. వైఫల్యం తప్పదు అంటూ..

ABN , First Publish Date - 2020-06-03T17:39:28+05:30 IST

జీ7 కూటమిలో భారత్, రష్యా, ఆస్ట్రేలియాలను అమెరికా అధ్యక్షుడు ఆహ్మానించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

చైనా ఆగ్రహం: భారత్‌కు ఆహ్వానమా.. వైఫల్యం తప్పదు అంటూ..

బీజింగ్: జీ7 కూటమిలో భారత్, రష్యా, ఆస్ట్రేలియాలను అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చైనాను చక్రబంధనం చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలన్నీ ఆమోదం కల్పోయి చివరికి విఫలమవుతాయని అమెరికాపై మండిపడింది. త్వరలో జరిగే జీ7 సమావేశాలకు భారత్, రష్యా, ఆస్ట్రేలియాలను ఆహ్వానిస్తానంటూ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. జీ7 కూటమిని విస్తరించాలని యోచిస్తున్నట్టు కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.  ఓవైపు కరోనా సంక్షోభానికి కారణం చైనాయే అని దుమ్మెత్తిపోయడంతో పాటు, జీ7 కూటమిలో కొన్ని చైనా అననుకూల దేశాల్ని భాగస్వాములను చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తుండటాన్ని చైనా ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ‘ప్రపంచ సంస్థలు, సమావేశాలన్నీ సభ్య దేశాల మధ్య నమ్మకాన్ని ప్రోత్సహించేలా ఉండాలి. చైనా చుట్టు చట్రం నిర్మిద్దామనే ప్రయత్నాలన్నీ విఫలం కాకతప్పదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2020-06-03T17:39:28+05:30 IST