తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

ABN , First Publish Date - 2021-11-23T00:28:02+05:30 IST

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యాయి.

తెలంగాణ: ఆ ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాకు చెందిన ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్సీలుగా ఎన్నికయినట్టు గెలుపు ధ్రువీకరణ పత్రాలు తీసుకున్న తర్వాత మంత్రి ప్రశాంత్ రెడ్డితో కలిసి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండా ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, వెంకట్రామి రెడ్డి, కౌశిక్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. తమకు అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఎదుగుతున్న తెలంగాణను చూసి ఓర్వలేక కేంద్ర ప్రభుత్వం తెలంగాణా ప్రభుత్వాన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుందని కడియం శ్రీహరి ఆరోపించారు. ధాన్యం సేకరణ కేంద్రం పరిధి అయినా కొనటం లేదన్నారు. 

Updated Date - 2021-11-23T00:28:02+05:30 IST