టీఆర్ఎస్ గూటికి ముచ్చర్ల సర్పంచ్
ABN , First Publish Date - 2022-05-17T05:39:50+05:30 IST
టీఆర్ఎస్ గూటికి ముచ్చర్ల సర్పంచ్
కందుకూరు, మే 16: టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు వరుసకడుతున్నారు. మొన్న మీర్పేట్ మున్సిపాలిటీలో ఇద్దరు కార్పొరేటర్లు, నిన్న కందుకూరు మండల పులిమామిడి సర్పంచ్ అనితా శ్రీనివా్సలు టీఆర్ఎ్సలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ముచ్చర్ల సర్పంచ్ ఇంజమూరి రాంచంద్రారెడ్డి మంత్రి కెటీఆర్ సమక్షంలో సోమవారం టీడీపీ నుంచి అధికార పార్టీలో చేరారు. ఈసందర్భంగా రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫార్మాసిటీ ఏర్పాటుతో ముచ్చర్ల పంచాయతీకి పేరు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయన్నారు. మంత్రి సబితారెడ్డి నేతృత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ముదిరాజ్, మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షుడు జి.లక్ష్మీనర్సింహారెడ్డి, నాయకులు ఎస్.సురేందర్రెడ్డి, సత్యనారాయణ, పాండుగౌడ్, దామోదర్గౌడ్, కృష్షరాంభూపాల్రెడ్డి, బాల్రెడ్డి, సర్పంచ్ అనితాశ్రీనివాస్ పాల్గొన్నారు.