ప్రజలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-05-24T05:50:24+05:30 IST

ప్రజలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌

ప్రజలను మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌

కందుకూరు, మే 23: రైతుసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. గడచిన ఏడు సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మైనార్టీ సెల్‌ ప్రధానకార్యదర్శి ఎండీ అబ్జల్‌బేగ్‌ ఆరోపించారు. నేదునూరు గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.  ప్రజలకు ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఏకకాలంలో రైతులకు ఒకేసారి లక్షవరకు పంటరుణాన్ని మాఫీ చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు కేవలం భూస్వాములకే మేలు జరుగుతుంది తప్ప వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులకు ఎలాంటి న్యాయం జరగడం లేదన్నారు. తమపార్టీ అధిష్టానం వరంగల్‌లో ప్రకటించిన డిక్లరేషన్‌ తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. డిక్లరేషన్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఎద్దేవా చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.  సమావేశంలో నాయకులు వరికుప్పల బాబు, రేవెళ్లి శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:50:24+05:30 IST