మంత్రి నిరంజన్రెడ్డికి సన్మానాలు
ABN , First Publish Date - 2021-01-19T05:20:31+05:30 IST
జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డికి ప్రజాప్ర తినిధులు, టీఆర్ఎస్ నాయకులు సోమవారం ఘ నంగా స్వాగతం పలికారు.
సుల్తానాబాద్, జనవరి 18: జిల్లా పర్యటనకు వచ్చిన వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డికి ప్రజాప్ర తినిధులు, టీఆర్ఎస్ నాయకులు సోమవారం ఘ నంగా స్వాగతం పలికారు. సన్మానాలు సత్కారాల తో ముంచెత్తారు. మండలంలోని గర్రెపల్లిలో రైతు వేదిక భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రికి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎంపీ వెంకటేశ్నేత, ఎం ఎల్సీ నారదాసు లక్ష్మణ్రావు, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్సింగ్ తదితరులు స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. సభా వేదికపైన ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి కూడా గజమాలతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ వీరగోని సుజాత రమేష్గౌ డ్, మండలంలోని గర్రెపల్లి, చిన్నకలువల, సుల్తానా బాద్ సింగిల్విండోల చైర్మన్లు జూపల్లి సందీప్రా వు, దేవరనేని మోహన్రావు, శ్రీగిరి శ్రీనివాస్ సు ల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, డైరక్ట ర్లు మంత్రితో పాటు ప్రముఖులను సన్మానించారు. మంత్రికి నాగలిని బహూకరించారు.తమ సమస్యల ను పరిష్కరించాలని గ్రామకార్యదర్శులు వివిధ డి మాండ్లను ప్రస్తావించారు.