మంత్రి శీనివాస్గౌడ్కు సన్మానం
ABN , First Publish Date - 2022-01-21T05:49:29+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోనే యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కె.ఆంజనేయులు అన్నారు.
పాలమూరు, జనవరి 20 : తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధితోనే యాదాద్రి భువన గిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైందని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కె.ఆంజనేయులు అన్నారు. గురువారం మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ను గజమాలతో పలువురు నాయకులు సన్మానించారు. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీవో) అందించిన ప్రపంచ ఉత్తమ పర్యాటక (వరల్డ్ బెస్ట్ టూరి జం విలేజ్) గ్రామంగా భూదాన్పోచంపల్లి ఎంపికవటం సంతోషమన్నారు. టూరిజం అభి వృద్ధికి మంత్రి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మల్లెపోగు శ్రీనివాస్, నరేష్, సాయికుమార్, జయన్న, యాదగిరి, విజయ్కుమార్, బాలరాజు, రమేష్, శ్రీకారం, ఎడ్ల కృష్ణ పాల్గొన్నారు.