బాబూజగ్జీవన్‌రాంకు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-07-07T03:28:27+05:30 IST

భారత మాజీ ఉపప్రధాని బాబూజగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

బాబూజగ్జీవన్‌రాంకు ఘన నివాళి
జహీరాబాద్‌ పస్తపుర్‌లో నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే మాణిక్‌రావు

భారత మాజీ ఉపప్రధాని బాబూజగ్జీవన్‌రాం వర్ధంతి సందర్భంగా బుధవారం సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలో నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. 

సంగారెడ్డి రూరల్‌/పటాన్‌చెరు/జోగిపేట/పెద్దశంకరంపేట/జహీరాబాద్‌/ఝరాసంగం/వట్‌పల్లి/హత్నూర, జూలై 6: సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ బాబూజగ్జీవన్‌రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ బొంగుల రవి, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బైండ్ల అశోక్‌, చక్రపాణి, దుర్గేష్‌, సాబేర్‌, విష్ణు తదితరులు పాల్గొన్నారు. పటాన్‌చెరులో టీఆర్‌ఎస్‌, దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌, గూడెం మధుసూధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, డివిజన్‌ అధ్యక్షుడు ఎండీ.అఫ్జల్‌, రుద్రారంశంకర్‌, ఆర్‌.శంకరయ్య, నీరుడిరఘు, డప్పు యాదయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. జోగిపేటలో ఎంపీపీ జోగు బాలయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్‌ నాగభూషణం, డాకూరు మాజీ సర్పంచ్‌ ఏ.శంకరయ్య, ఆత్మ డైరెక్టర్‌ ఎల్లయ్య, కౌన్సిలర్‌ దుర్గేశ్‌, నాయకులు మొగులయ్య, సటికె రాజు, ఫ్రెండ్స్‌ యూత్‌ అధ్యక్షుడు మోహన్‌ నివాళులర్పించారు. పెద్దశంకరంపేటలో అంబేడ్కర్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నాందేడ్‌ దుర్గయ్య, సభ్యులు నాగరాజు, శంకరయ్య, బాలయ్య, దాకయ్య, శ్రీకాంత్‌, క్రిష్ణకాంత్‌, సురేష్‌, శ్రావణ్‌, శివకుమార్‌, మహేష్‌, నిఖిల్‌, అవినాశ్‌, యాదగిరి పాల్గొన్నారు. కోహీర్‌ మండలం చింతలఘట్టులో జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి ఎమ్మార్పీఎస్‌ నాయకులు, దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు. జహీరాబాద్‌లోని పస్తపుర్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో ఎస్సీ, ఎస్టీ  విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు బంటు రామకృష్ణ, నాయకులు విజయకుమార్‌, మోహియోద్దిన్‌, బండి మోహన్‌, జైరాజ్‌, శివప్ప, ఇజ్రాయెల్‌ బాబీ, లక్ష్మీకాంత్‌, గౌతమ్‌, మొగులయ్య, వరాలు, మోసెస్‌, స్వామిదాస్‌, సుధాకర్‌, తులసిరామ్‌ రాథోడ్‌, బాలరాజ్‌, జయప్ప, రాజు, శాంతకుమార్‌, చింతలగట్టు గ్రామంలో విక్టోరియారాణి, శేఖర్‌ ఆనందం, విజయ్‌, మహేందర్‌, దయానంద్‌, ఇమ్మానుయేల్‌, రాచయ్య, సుమన్‌, బన్నీ, చింటూ పాల్గొన్నారు. ఝరాసంగం మండలంలో ఎస్సీ వసతి గృహం వార్డెన్‌ వెంకటేషం, నర్సింహులు, మహేందర్‌, అశోక్‌ పాల్గొన్నారు. వట్‌పల్లిలో ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు ఎర్రోళ్ల శివయ్య, ఉపాధ్యక్షుడు భూమయ్య, అంబేడ్కర్‌ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దాస్‌, రవి, శ్యామయ్య, నాగేష్‌ నివాళులర్పించారు. హత్నూర మండలం గుండ్లమాచునూర్‌ గ్రామంలో ఏఐఎ్‌సఎ్‌సడీ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్‌ ఇండియా సమతా సైనిక్‌ రాష్ట్ర నాయకులు నర్సింగ్‌రాజ్‌, జిల్లా నాయకులు శంకరయ్య, ప్రభాకర్‌, బీఎ్‌సపీ  నాయకులు అశోక్‌, సాయికుమార్‌, శ్రీకాంత్‌, వీరేశం, చింటు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-07-07T03:28:27+05:30 IST