అల్లూరి, గంటందొరలకు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-08-14T06:29:31+05:30 IST
స్థానిక అల్లూరి పార్కులో గల అల్లూరి సీతారామరాజు, గంటందొరల సమాధులను నర్సీపట్నం ఆర్డీవో భవానీ శంకర్ శనివారం సందర్శించారు.
కృష్ణాదేవిపేట, ఆగస్టు 13: స్థానిక అల్లూరి పార్కులో గల అల్లూరి సీతారామరాజు, గంటందొరల సమాధులను నర్సీపట్నం ఆర్డీవో భవానీ శంకర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమాధులు వద్ద పుష్పగుచ్ఛాలు, పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లోచల సుజాత, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, ఎంపీటీసీ సభ్యుడు చింతల బుల్లిప్రసాద్, నర్సీపట్నం డీఎల్పీవో మూర్తిరాజు, డీటీ ఆనంద్, వీఆర్వోలు శ్రీధర్, పద్మ, కార్యదర్శులు అప్పారావు, శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు.