అల్లూరి, గంటందొరలకు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-08-14T06:29:31+05:30 IST

స్థానిక అల్లూరి పార్కులో గల అల్లూరి సీతారామరాజు, గంటందొరల సమాధులను నర్సీపట్నం ఆర్డీవో భవానీ శంకర్‌ శనివారం సందర్శించారు.

అల్లూరి, గంటందొరలకు ఘన నివాళి
కృష్ణాదేవిపేట అల్లూరి, గంటందొర సమాధుల వద్ద నివాళులర్పిస్తున్న నర్సీపట్నం ఆర్డీవో భవానీ శంకర్‌


కృష్ణాదేవిపేట, ఆగస్టు 13: స్థానిక అల్లూరి పార్కులో గల అల్లూరి సీతారామరాజు, గంటందొరల సమాధులను నర్సీపట్నం ఆర్డీవో భవానీ శంకర్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సమాధులు వద్ద పుష్పగుచ్ఛాలు, పూలమాలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ లోచల సుజాత, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, ఎంపీటీసీ సభ్యుడు చింతల బుల్లిప్రసాద్‌, నర్సీపట్నం డీఎల్‌పీవో మూర్తిరాజు, డీటీ ఆనంద్‌, వీఆర్‌వోలు శ్రీధర్‌, పద్మ, కార్యదర్శులు అప్పారావు, శ్రీనివాస్‌, రాజేష్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T06:29:31+05:30 IST