గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలి
ABN , First Publish Date - 2022-05-21T05:00:35+05:30 IST
గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలి
- బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ధర్నా
ఆమనగల్లు, మే 20: గిరిజనుల రిజర్వేషన్లను పెంచాలని డిమాండ్ చేస్తూ బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రిజర్వేషన్ల పెంపు విషయంలో సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు సీఎం కేసీఆర్ హామీకి అనుగుణంగా 12శాతానికి పెంచాలని కోరుతూ గిరిజన మోర్చా మున్సిపాలిటీ, మండల అధ్యక్షులు రవీందర్ నాయక్, హన్మంత్నాయక్ల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ పాండూనాయక్కు అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు చెన్నకేశవులు, శ్రీకాంత్సింగ్, రాము నాయక్, విజయ్ కృష్ణ, రవీందర్ నాయక్, హన్మంత్ నాయక్, పంతూనాయక్, రవిరాథోడ్, గోపి పాల్గొన్నారు.