నిండుకుండలా అరణియార్‌

ABN , First Publish Date - 2021-10-19T06:51:22+05:30 IST

జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో పెద్దదైన అరణియార్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 32 అడుగులు కాగా ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం అరణియార్‌ గేట్లను ట్రయల్‌ రన్‌ నిర్వహించి నీటిని విడుదల చేశారు.

నిండుకుండలా అరణియార్‌

ట్రయల్‌ రన్‌ నిర్వహించిన అధికారులు 


పిచ్చాటూరు, అక్టోబరు 18: జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్టుల్లో పెద్దదైన అరణియార్‌ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 32 అడుగులు కాగా ప్రస్తుతం 29 అడుగుల మేర నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన నీటిపారుదలశాఖ అధికారులు సోమవారం అరణియార్‌ గేట్లను ట్రయల్‌ రన్‌ నిర్వహించి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్‌లో 281 ఎఫ్‌టీ, ఎఫ్‌ఆర్‌ఎల్‌ కాగా ప్రస్తుతం 279 ఎఫ్‌టీ లెవెల్‌ ఉంది. ప్రాజెక్టులో 1853 టీఎంసీ నిల్వ ఉంచుకోవచ్చు. ప్రస్తుతం 1576 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. ఇన్‌ప్లో 280 క్యూ సెక్కులు కాగా అవుట్‌ ఫ్లో ఏమీ లేదు. ట్రయల్‌ రన్‌ సందర్భంగా నీటిపారుదలశాఖ ఈఈ మదన్‌గోపాల్‌రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T06:51:22+05:30 IST