పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ:టీటీడీ

ABN , First Publish Date - 2021-10-20T07:50:05+05:30 IST

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వున్న లడ్డూ కౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోందని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ:టీటీడీ
శ్రీవారి ఆలయం వద్ద వున్న లడ్డూ కౌంటర్లు

తిరుమల, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయం వద్ద వున్న లడ్డూ కౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోందని టీటీడీ మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా ప్రసాదాలు స్వీకరిస్తున్నారని పేర్కొంది. లడ్డూకాంప్లెక్స్‌లో వున్న 62 కౌంటర్లలో 55 కౌంటర్లను టెండరు ద్వారా బెంగుళూరుకు చెందిన కేవీఎం ఇన్‌ఫో సంస్థకు టీటీడీ కేటాయించింది. కొవిడ్‌ నేపథ్యంలో తిరుమలకు ఇంకా పూర్తిస్థాయిలో భక్తులను అనుమతించకపోవడంతో రోజుకు 25 వేల నుంచి 30వేలమంది వరకు భక్తులు దర్శనానికి వస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 31 లడ్డూకౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు 6 బ్యాంకులు స్పాన్సర్‌షిప్‌ అందించాయి. బ్యాంకులు ఒక్కో కౌంటర్‌కు నెలకు సుమారు రూ.40.365 స్పాన్సర్‌షి్‌పగా చెల్లిస్తున్నాయి. ఇండియన్‌ బ్యాంక్‌ 10, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు 5, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 3, కెనరా బ్యాంక్‌ 3, ఫెడరల్‌ బ్యాంక్‌ 3, తిరుమల బ్యాంక్‌ 2 కౌంటర్లకు స్పాన్సర్‌షిప్‌ చేశాయి. తగినన్ని లడ్డూ కౌంటర్లు ఉండడంతో భక్తులు ఆలస్యం లేకుండా ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారని టీటీడీ తెలిపింది.

Updated Date - 2021-10-20T07:50:05+05:30 IST