డిప్యుటేషన్పై ఏడుగురు తహసీల్దార్ల బదిలీ
ABN , First Publish Date - 2020-08-11T11:18:11+05:30 IST
జిల్లాలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఏడుగురు తహసీల్దార్లను డిప్యుటేషన్పై బదిలీ చేస్తూ కలెక్టర్ భరత్గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ ..
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 10: జిల్లాలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఏడుగురు తహసీల్దార్లను డిప్యుటేషన్పై బదిలీ చేస్తూ కలెక్టర్ భరత్గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పులిచెర్ల తహసీల్దార్ సి.శ్రీనివాసులును గంగవరానికి, ఇక్కడున్న బెన్నురాజ్ను ఐరాలకు, పెద్దపంజాణిలోని టీజీ మోహనవళ్లిని ఎస్ఆర్పురానికి, అక్కడున్న ఎన్ఎం గుర్రప్పను కలెక్టరేట్కు, వి.కోటలోని ఎస్మురళీధర్ను గుడుపల్లెకు, సదుంలోని కె.బాబూ రాజేంద్రప్రసాద్ను గుడిపాలకు డిప్యుటేషన్పై బదిలీ చేశారు. కాగా, సదుం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న ఎస్ఎం అన్సారీని అక్కడే పుల్ అడిషనల్ చార్జి తహసీల్దార్గా నియమించారు.