పెండింగ్లో ఉన్న అప్పీళ్లు ప్రత్యేక ట్రిబ్యునల్కు బదిలీ
ABN , First Publish Date - 2021-04-13T07:23:34+05:30 IST
వివిధ రెవెన్యూ అధి కారుల వద్ద భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు రివిజన్ కేసులు ప్రత్యేక ట్రిబ్యునల్కు బదిలీ అయ్యా యని రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
అదనపు కలెక్టర్ రాంబాబు
నిర్మల్ కల్చరల్, ఏప్రిల్ 12 : వివిధ రెవెన్యూ అధి కారుల వద్ద భూ హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు రివిజన్ కేసులు ప్రత్యేక ట్రిబ్యునల్కు బదిలీ అయ్యా యని రెవెన్యూశాఖ అదనపు కలెక్టర్ రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక ట్రిబ్యునల్ కేసులను పురస్కరించుకుని మార్చి 18న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను పురస్కరించుకొని వివిధ రెవెన్యూ అధి కారుల నుండి ప్రత్యేక ట్రిబ్యునల్కు బదిలీ అయిన కేసులలో తమ వాదనల కోసం పార్టీ వ్యక్తిగత విచారణ కోసం ఈ నెల 15న వ్యక్తిగత విచారణ కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ సమక్షంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.