విలువ ఆధారిత ఉత్పత్తులపై మహిళలకు శిక్షణ
ABN , First Publish Date - 2022-05-25T05:42:41+05:30 IST
కొత్త రుచులతో ప్రజల ముందుకు వెళితే వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందని మత్స్య విశ్వవిద్యాలయం రిజాస్ట్రార్ సుధాకర్, ఉండి మత్స్యపరిశోధన కేంద్రం అధిపతి నీరజ అన్నారు.
ఉండి, మే 24: కొత్త రుచులతో ప్రజల ముందుకు వెళితే వ్యాపారం గణనీయం గా అభివృద్ధి చెందుతుందని మత్స్య విశ్వవిద్యాలయం రిజాస్ట్రార్ సుధాకర్, ఉండి మత్స్యపరిశోధన కేంద్రం అధిపతి నీరజ అన్నారు. ఎన్ఆర్పిఅగ్రహారంలోని మత్స్య పరిశోధన కేంద్రంలో విలువ ఆధారిత ఉత్పత్తులపై మహిళలకు మూడు రోజుల శిక్షణ మంగళవారం ప్రారంభించారు. చేపలు, రొయ్యలతో మంచి విలువలతో కూడిన వంటకాలు అందించాలన్నారు. గృహిణిగా ఇంట్లో ఖాళీ సమయాలలో చిరు వ్యాపారం చేసుకోవచ్చునని సూచించారు. చేపలతో సాధారణ వంటకాలే కాకుండా కట్లెట్ పచ్చళ్లు లాభసాటి అన్నారు. రెండు రోజులు శిక్షణ తర్వాత ఫీల్డ్ విజిట్కు తీసుకువెళతామన్నారు. కె.శ్రీనివాసరావు, యిర్రింకి సూర్యారావు పాల్గొన్నారు.