నేడు సత్యదేవుడి ఆన్లైన్ వ్రతాలు ట్రయిల్ రన్
ABN , First Publish Date - 2020-10-01T08:10:02+05:30 IST
సత్యదేవుడి సన్నిధికి విచ్చేసి వ్రతం ఆచరించుకోలేని భక్తులకోసం అన్నవరం దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ వ్రతాల ప్రక్రియ
3వతేదీనుంచి నిరంతర ప్రక్రియ
అన్నవరం, సెప్టెంబరు 30:సత్యదేవుడి సన్నిధికి విచ్చేసి వ్రతం ఆచరించుకోలేని భక్తులకోసం అన్నవరం దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ వ్రతాల ప్రక్రియ నేడు ట్రయిల్రన్ ద్వారా ప్రారంభించనున్నట్లు ఆలయ పీఆర్వో కొండలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
లోటుపాట్లను సవరించి మూడోతేదీ నుంచి నిరంతరాయంగా ఆన్లైన్ వ్రత ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వ్రతం టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయించామని తెలిపారు.