ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
ABN , First Publish Date - 2022-01-20T05:16:11+05:30 IST
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
యాచారం: ఓ వెంచర్లో బిగించడం కోసం 11కేవీ విద్యుత్ స్తంభాలను ఇబ్రహీంపట్నం నుంచి నందివనపర్తికి తరలిస్తుండగా ట్రాక్టర్ గోతిలోకి దూసుకుపోయి డ్రైవర్ దుర్మరణం పాలైన ఘట న బుధవారం ఉదయం మొగ్గుళ్లవంపు సమీపంలో జరిగింది. పో లీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తుర్కగూడకు చెందిన జంగయ్య(48) ఇబ్రహీంపట్నంలో విద్యుత్ స్తంభాలు ట్రాక్టర్లో లోడ్ చేసుకున్నాడు. వాటిని నందివనపర్తి సమీప వెంచర్లో దింపేందుకు బయల్దేరాడు. ఓవర్లోడ్ కారణంగా ట్రాక్టర్ గోతిలోకి దూసుకుయి బోల్తాపడింది. జంగయ్యపై స్తంభాలు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అతడికి భార్య సుగుణమ్మ, కుమారుడు కేశవులు ఉన్నాడు, కొడుకు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు. జంగయ్య మృతదేహానికి పోస్టుమార్టం చేయించి అప్పగించామని, ఓవర్ లోడే ప్రమాదానికి కారణం అని సీఐ లింగయ్య చెప్పారు.