ముగిసిన సచివాలయ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-27T10:38:56+05:30 IST

జిల్లావ్యాప్తంగా ఈనెల 20తేది నుంచి ప్రారంభమైన సచివాలయ పరీక్షలు శనివారంతో ముగిశాయి. గతేడాది సెప్టెంబరులో తొలివిడ

ముగిసిన సచివాలయ పరీక్షలు

చిత్తూరు, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా ఈనెల 20తేది నుంచి ప్రారంభమైన సచివాలయ పరీక్షలు శనివారంతో ముగిశాయి. గతేడాది సెప్టెంబరులో తొలివిడత జరిగిన పరీక్షలకు అధికసంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తితో రెండోవిడత హాజరు శాతం తగ్గింది.


కాగా, శనివారం ఉదయం విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్‌ పరీక్షలకు 112 మంది దరఖాస్తు చేసుకోగా, 63మంది(56శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన అనిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 270మంది దరఖాస్తు చేసుకోగా, 255 మంది(94శాతం) హాజరయ్యారు. జడ్పీ ఇన్‌చార్జి సీఈవో ప్రభాకర్‌రెడ్డి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.

Updated Date - 2020-09-27T10:38:56+05:30 IST