స్వగ్రామానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-18T05:26:43+05:30 IST

తన స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మంగళవారం జరిగిన వివాహ వేడుకలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

స్వగ్రామానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
కార్యకర్తలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

వంగూరు మే 17 : తన స్వగ్రామమైన నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో మంగళవారం జరిగిన వివాహ వేడుకలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ, ఎనుముల రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తన అన్న కొడుకు వివాహం ఈ నెల 15న జరిగింది. రిసెప్షన్‌ సందర్భంగా వారి స్వగృహంలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మాజీ ఎంపీ మల్లురవి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి రాకతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో గ్రామంలో సందడి నెలకొన్నది. 

Updated Date - 2022-05-18T05:26:43+05:30 IST