రేపు స్విమ్స్ ఓపీకి సెలవు
ABN , First Publish Date - 2021-01-25T06:49:38+05:30 IST
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్విమ్స్ ఆస్పత్రిలో ఓపీ, ఓటీ సేవలకు సెలవు ప్రకటించినట్టు డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ తెలిపారు.
తిరుపతి (వైద్యం), జనవరి 24: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్విమ్స్ ఆస్పత్రిలో ఓపీ, ఓటీ సేవలకు సెలవు ప్రకటించినట్టు డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ తెలిపారు. ఈమేరకు ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రజలు, పేషెంట్లు ఈ విషయాన్ని గుర్తించి, సహకరించాలని కోరారు.