నేడు 6,800 మందికి వ్యాక్సిన్‌ : ఆర్డీవో

ABN , First Publish Date - 2021-05-12T06:14:00+05:30 IST

కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో బుధవారం 6800 మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ వేయనున్నట్లు కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు.

నేడు  6,800 మందికి వ్యాక్సిన్‌ : ఆర్డీవో

కొవ్వూరు, మే 11 : కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో బుధవారం 6800 మందికి రెండో డోసు వ్యాక్సిన్‌ వేయనున్నట్లు కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి తెలిపారు. డివిజన్‌ పరిధిలోని 13 మండలాలు, మూడు మున్సిపాలిటీలలో మెదటి విడత వ్యాక్సిన్‌ వేయించుకుని సుమారుగా నెల రోజులు గడిచిన వారికి మాత్రమే రెండో డోసు వేయనున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాలమేరకు కొవిడ్‌ నిబంధనలకు లోబడి వ్యాక్సిన్‌ ఇచ్చేవారికి వలంటీర్ల ద్వారా స్లిప్పులు అందించామన్నారు. స్లిప్పులు తీసుకున్నవారు మాత్రమే వ్యాక్సిన్‌కు రావాలన్నారు. మిగిలిన వారికి దశలవారిగా వలంటీర్ల ద్వారా సమాచారం అందించి వ్యాక్సినేషన్‌ పూర్తి చేస్తామన్నారు.


Updated Date - 2021-05-12T06:14:00+05:30 IST