నేడు, రేపు ఐసెట్‌

ABN , First Publish Date - 2020-09-30T06:09:33+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ ఐసెట్‌ -2020 పరీక్ష బుధవారం, గురువారం జరుగనుంది

నేడు, రేపు ఐసెట్‌

కేంద్రాల్లో పరీక్షరాయనున్న 3970 మంది అభ్యర్థులు


ఖమ్మంఎడ్యుకేషన్‌ సెప్టెంబరు 29: ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశాల కోసం టీఎస్‌ ఐసెట్‌ -2020 పరీక్ష బుధవారం, గురువారం జరుగనుంది. ఇందుకోసం ఖమ్మం జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మంలో 6 కేంద్రాలు, సత్తుపల్లిలో 2కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మద్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. 3సెషన్స్‌లో జరిగే ఈ పరీక్షకు మొత్తం 3970 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఐసెట్‌ కన్వీనర్‌ రాజిరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-09-30T06:09:33+05:30 IST