నేడు శబరి స్మృతి యాత్ర

ABN , First Publish Date - 2020-10-31T06:40:54+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శబరిస్మృతి యాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు

నేడు శబరి స్మృతి యాత్ర

భద్రాచలం, అక్టోబరు 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శబరిస్మృతి యాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈసారి కొవిడ్‌ వైరస్‌ ప్రబలుతున్న క్రమంలో ప్రభుత్వ నిబంధనల మేరకు దమ్మక్క సేవా యాత్ర మాదిరిగానే శబరి స్మృతి యాత్రను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు పలు రకాల ఫలాలు, పుష్పాలతో రామచంద్రునికి పూజాది కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముందుగా గిరి ప్రదక్షిణ, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించి పుష్పాలు, ఫలాలతో మంత్రపుష్పంతో శబరి యాత్ర పరిసమాప్తం కానుంది.

Updated Date - 2020-10-31T06:40:54+05:30 IST