నేడు రాఖీ పౌర్ణమి

ABN , First Publish Date - 2020-08-03T09:57:20+05:30 IST

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను సోమవారం జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు.

నేడు రాఖీ పౌర్ణమి

కరోనా వేళ కానరాని సందడి


(నరసన్నపేట, ఆగస్టు 2) : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండగను సోమవారం జరుపుకునేందుకు జిల్లావాసులు సన్నద్ధమవుతున్నారు. కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది రాఖీల సందడి పెద్దగా కనిపించలేదు. లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లో ఉండడంతో ఎవరింట్లో వాళ్లే ఉంటూ వేడుకలు నిర్వహించుకోనున్నారు.  ఇప్పటికే చాలామంది.. దూరప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా రాఖీలు పంపారు. కరోనా నుంచి రక్షణ పొందాలని కోరుతూ ఈ ఏడాది వినూత్నంగా కొంతమంది రాఖీలతో పాటు మాస్క్‌లు, శానిటైజర్లు కూడా తమ సోదరులకు పంపించి.. ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. 


Updated Date - 2020-08-03T09:57:20+05:30 IST