నేడు జిల్లా బంద్‌

ABN , First Publish Date - 2021-03-05T07:02:25+05:30 IST

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, పెరిగిన పెట్రో ధరలను తగ్గించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.

నేడు జిల్లా బంద్‌

కర్నూలు(న్యూసిటీ), మార్చి 3: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, పెరిగిన పెట్రో ధరలను తగ్గించాలని కోరుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ శుక్రవారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు బీజేపీ మినహా అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బస్సులు డిపోలోనే నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువజనులు, వర్తక, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రభుత్యేతర సంస్థల ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొననున్నారు. ఉదయం 6 గంటల నుంచే వామపక్షాల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపై నిరసనలు తెలపనున్నారు

Updated Date - 2021-03-05T07:02:25+05:30 IST