దక్షిణాదిలోని ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కలవరం

ABN , First Publish Date - 2020-06-04T01:09:32+05:30 IST

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమిళనాడులో బుధవారం...

దక్షిణాదిలోని ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కలవరం

చెన్నై/బెంగళూరు: తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తమిళనాడులో బుధవారం కొత్తగా 1286 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో.. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25000 మార్క్‌ను దాటింది. తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 25,872కు చేరింది. బుధవారం ఒక్కరోజే కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో 11 మంది చనిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడులో కరోనా మరణాల సంఖ్య 208కి చేరింది.


కర్ణాటకలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4063కు చేరింది.

Updated Date - 2020-06-04T01:09:32+05:30 IST