నేడు లోకేష్‌ రాక

ABN , First Publish Date - 2021-03-07T07:05:52+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆదివారం జిల్లాకు రానున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన జిల్లా పర్యటనకు వస్తున్నట్టు సమాచారం.

నేడు లోకేష్‌ రాక

పిఠాపురం, మార్చి 6: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆదివారం జిల్లాకు రానున్నారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన జిల్లా పర్యటనకు వస్తున్నట్టు సమాచారం. మండపేట, పిఠాపురం మున్సిపాల్టీల్లో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం మండపేట మున్సిపాల్టీ పరిధిలోని కలవపువ్వు సెంటర్‌తోపాటు పలు వార్డుల్లో ఆయన రోడ్‌షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గొల్లప్రోలు నగర పంచాయతీలోని తటపర్తి రోడ్‌, ఈబీసీ కాలనీ, దేవీనగరం, మార్కెట్‌ సెంటర్‌ల్లో జరిగే రోడ్‌షోలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 8.30 గంటల వరకు పిఠాపురంలోని పాదగయ, పోలీస్‌స్టేషన్‌ పక్క రోడ్డు, ఆదిత్యస్కూల్‌, మంగళవారమ్మపేట, దూళ్ల సంత, స్టేట్‌బ్యాంక్‌ రోడ్డు, ఉప్పాడసెంటర్‌, కోటగుమ్మం సెంటర్‌ల్లో జరిగే రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. 

Updated Date - 2021-03-07T07:05:52+05:30 IST