కాంతులీనిన తిరువళ్లువర్‌ విగ్రహం

ABN , First Publish Date - 2022-03-20T15:54:31+05:30 IST

పౌర్ణమి రోజున కన్నియాకుమారి ఆకాశంలో ఎర్రటి చంద్రుడుని సందర్శకులు వీక్షించి ఆనందించారు. ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిస్థాయిలో

కాంతులీనిన తిరువళ్లువర్‌ విగ్రహం

పెరంబూర్‌(చెన్నై): పౌర్ణమి రోజున కన్నియాకుమారి ఆకాశంలో ఎర్రటి చంద్రుడుని సందర్శకులు వీక్షించి ఆనందించారు. ప్రతి పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తిస్థాయిలో కనిపిస్తుంటాడు. ఆ సమయాన చంద్రుడు తెల్లటి రంగు లేదా లేత పసుపు రంగులో కనిపించడం సహజంగా జరుతుంటోంది. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రతిబింబం వీక్షించేందుకు వేలాది మంది భక్తులు కన్నియాకుమారి సముద్రతీరానికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు తూర్పు వైపు ఆకాశంలో ఈ దర్శనం కనిపించింది. కన్నియాకుమారి సముద్రం మధ్యలో ఏర్పాటుచేసిన వివేకానంద రాక్‌, 133 అడుగుల ఎత్తున్న తిరువళ్లువర్‌ విగ్రహం మధ్య ఆకాశంలో పూర్తిస్థాయిలో చంద్రుడు ఎర్రటి రంగులో దర్శనమిచ్చాడు. ఈ అపురూపదృశ్యాన్ని సందర్శకులు సెల్పీ తీసుకుంటూ ఆనందంగా వీక్షించారు.

Updated Date - 2022-03-20T15:54:31+05:30 IST