Tirupati నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసన
ABN , First Publish Date - 2021-12-07T17:11:13+05:30 IST
తిరుపతి నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసనకు దిగింది.
తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఎదుట సీపీఐ నిరసనకు దిగింది. వరదల వల్ల పారిశుద్ధ్యం లోపించి దోమల బెడద ఎక్కువైందని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. దోమల బెడదతో తిరుపతి ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. తిరుపతిలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించాలని మున్సిపల్ కార్యాలయం ముందు సీపీఐ నేతలు నిరసనకు దిగారు.