వైభవంగా తిరుపతమ్మ బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-02-27T06:02:32+05:30 IST
ఇన్నర్రింగ్ రోడ్డులో వేంచేసిన తిరుపతమ్మ తల్లి ఆలయంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
గుంటూరు, ఫిబ్రవరి 26: ఇన్నర్రింగ్ రోడ్డులో వేంచేసిన తిరుపతమ్మ తల్లి ఆలయంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం మహా కుంభాభిషేకం నిర్వహించారు. అలానే శనివారం ఉదయం సామూహిక కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యదర్శి కోనూరు సతీష్శర్మ తెలిపారు. కల్యాణ మహోత్సవానికి విశాఖ శారదా పీఠాధిపతి శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, హోం మంత్రి మేకతోటి సుచరిత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, వైసీపీ పశ్చిమ ఇన్చార్జి చంద్రగిరి ఏసురత్నం తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈదా సాంబిరెడ్డి, మాజీ సర్పంచ్ తనుబుద్ధు కృష్ణారెడ్డి, పిట్లల శ్రీనివాస్, ఏల్చూరి వెంకయ్య, గాదె సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.