గుండెల నిండా.. తిరంగా జెండా..
ABN , First Publish Date - 2022-08-14T08:39:56+05:30 IST
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకూ ప్రతి చోటా శనివారం తిరంగా ర్యాలీలు నిర్వహించారు.
స్వతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొన్న అశేష జనం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణలో పల్లె నుంచి పట్నం వరకూ ప్రతి చోటా శనివారం తిరంగా ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డిలో 750 మీటర్ల జాతీయ పతాకంతో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. ఖమ్మంలో నిర్వహించిన ఫ్రీడం రన్లో వేలాది మంది విద్యార్థులు 2 కి.మీ. పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట, రాయపర్తిలో నిర్వహించిన ర్యాలీలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. నిజామాబాద్లో 750 మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ర్యాలీలో మంత్రి ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన వజ్రోత్సవాలకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. కాగా, హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో శనివారం జాతీయ జెండా ఆవిష్కరించారు.