మళ్లీ టిక్‌ టాక్‌?

ABN , First Publish Date - 2021-07-21T07:17:04+05:30 IST

భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌ టాక్‌ యాప్‌, పేరు మార్చుకుని తిరిగి దేశంలోకి ప్రవేశించబోతోందా..?

మళ్లీ టిక్‌ టాక్‌?

  • పబ్‌జీ, షీన్‌ తరహాలోనే పేరు మార్చుకుని..దేశంలోకి పునఃప్రవేశం
  • ట్రేడ్‌మార్క్‌ కోసం బైట్‌డ్యాన్స్‌ దరఖాస్తు


న్యూఢిల్లీ, జూలై 20: భారత ప్రభుత్వం నిషేధించిన టిక్‌ టాక్‌ యాప్‌, పేరు మార్చుకుని తిరిగి దేశంలోకి ప్రవేశించబోతోందా..? ఆ యాప్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌ కొత్తగా టిక్‌టాక్‌ (ఖీజీఛిజు ఖీౌఛిజు) అన్న పేరును ట్రేడ్‌మార్క్‌గా దరఖాస్తు చేసుకోవడంతో ఇదే అనుమానాన్ని టెక్‌ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దరఖాస్తును బైట్‌ డ్యాన్స్‌ సంస్థ ఈ నెల 6న దాఖలు చేసిందని టెక్నాలజీ నిపుణుడు ముకుల్‌ శర్మ ట్వీట్‌ చేశారు. దీనిపై ఆ సంస్థ నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినప్పటికీ.. తమ సంస్థ భారత్‌లోకి తిరిగి ప్రవేశించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపినట్లు కొన్ని టెక్‌ వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. పబ్‌జీ ఇప్పటికే బ్యాటిల్‌గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా పేరిట భారత్‌లో అడుగుపెట్టగా టిక్‌టాక్‌ అదే దారిన పయనించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు చెందిన ‘షీన్‌’ ఈ-కామర్స్‌ వేదిక సైతం, తాజాగా అమెజాన్‌ ద్వారా భారత్‌లోకి ఈ నెల 26, 27 తేదీల్లో రానుంది.  

Updated Date - 2021-07-21T07:17:04+05:30 IST