ఒక్క పిరికెడు కారం పొడితో ఏకంగా కోటి రూపాయలను కొట్టేశారు.. పట్టపగలే షోరూమ్లోకి దర్జాగా ఎంట్రీ ఇచ్చి..!
ABN , First Publish Date - 2022-04-21T15:32:49+05:30 IST
జల్సాలకు అలవాటు పడిన కొందరు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దారుణాలు తెగబడుతున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు...
జల్సాలకు అలవాటు పడిన కొందరు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దారుణాలు తెగబడుతున్నారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్లో జరిగిన దోపిడీ సంచలనం కలిగించింది. కొందరు దుండగులు పిరికెడు కారం పొడితో ఏకంగా కోటి రూపాయలు కొట్టేశారు. పట్టపగలే షోరూమ్లోకి దర్జాగా ఎంట్రీ ఇచ్చి, వారు చేసిన పని.. స్థానికులను షాక్కు గురి చేసింది. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్ సుభాష్ చౌక్ ప్రాంతంలో ఉన్న ఓ షోరూం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆల్-మారుతీ ఎరీనా షోరూమ్లో పని చేస్తున్న అఖిల్ అనే వ్యక్తి.. కంపెనీకి సంబంధించిన నగదును తరలిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో షోరూమ్ నుంచి నగదు ఉన్న బ్యాగులను తరలిస్తున్నాడు. ఆ సమయంలో మిగతా ఇద్దరు ఉద్యోగులు షోరూమ్ బయట ఉన్న వ్యాన్ వద్ద ఉన్నారు. అఖిల్ నగదు బ్యాగుతో షోరూమ్ నుంచి వస్తుండగా.. నలుగురు దుండగులు ఎదురుగా వచ్చారు. అఖిల్ కళ్లలో కారం చల్లి, అతడి చేతిలోని కోటి రూపాయల బ్యాగును లాక్కొని పారిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
వంట చేయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావ్.. అంటూ మండిపడ్డ భర్త... చివరకు భార్యకు బలవంతంగా..
అలాగే కంపెనీ ఉద్యోగులైన అఖిల్, మిగతా ఇద్దరిని విచారిస్తున్నారు. దోపిడీ సమయంలో షోరూమ్ బయట ఉన్న వ్యాన్లో మరో ఆరు బ్యాగుల్లో నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే ఘటన జరిగిన ఒక రోజు ముందు రాత్రి హర్యానాలోని ఫతేహాబాద్లో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడికి చెందిన స్కార్పియో వాహనం చోరీకి గురైనట్లు చెప్పారు. ఈ రెండు చోరీలు ఒకే ముఠా చేసిందా, లేదా వేరే ప్రాంతానికి చెందిన వారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.