ఇంట్లోకి వచ్చిన పామును చంపి.. కూర వండి..

ABN , First Publish Date - 2020-09-20T15:04:29+05:30 IST

పామును చంపి వండుకుని తిన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా మేట్టూరు తంగమామునిపట్టణానికి చెందిన శివకుమార్‌(40) తన ఇంట్లో

ఇంట్లోకి వచ్చిన పామును చంపి.. కూర వండి..

చెన్నై (ఐసిఎఫ్‌): పామును చంపి వండుకుని తిన్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సేలం జిల్లా మేట్టూరు తంగమామునిపట్టణానికి చెందిన శివకుమార్‌(40) తన ఇంట్లో ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సురేష్‌, మహమ్మద్‌ హుస్సేన్‌తో కలసి పామును చంపి చిన్న ముక్కలుగా చేశారు. మరో మిత్రుడు జయప్రకాష్‌తో కలసి కాళియమ్మన్‌ ఆలయ వెనుక  కూర వండుకుని తిన్నారు. ఈ దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీసి స్నేహితులకు వాట్సాప్‌ ద్వారా పంపించారు. అటవీ శాఖ చట్టం ప్రకారం పామును చంపడం నేరం కావడంతో మేట్టూరు అటవీ శాఖ అధికారులు విచారణ చేపట్టి, వారిని అరెస్టు చేశారు.

Updated Date - 2020-09-20T15:04:29+05:30 IST