వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి అదృశ్యం
ABN , First Publish Date - 2021-05-05T18:11:22+05:30 IST
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యమయ్యారు. మాధవనగర్లో నివసిస్తున్న జి. నాగేశ్వర్ కుమారుడు ప్రజ్వల్(28) ప్రగతినగర్లో
హైదరాబాద్/సైదాబాద్: వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యమయ్యారు. మాధవనగర్లో నివసిస్తున్న జి. నాగేశ్వర్ కుమారుడు ప్రజ్వల్(28) ప్రగతినగర్లోని డీఆర్కే కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. ఇటీవల ఓ యువతి పెళ్లి చేసుకోమని ప్రతిపాదించగా.. అతడు ఆమెను వివాహం చేసుకుంటానని తండ్రికి చెప్పాడు. పెళ్లి నిశ్చయానికి ఇది మంచి సమయంకాదని, తర్వాత మాట్టాడుకుందామని నాగేశ్వర్ కుమారుడిని సముదాయించాడు. ప్రజ్వల్ కోపంతో గతనెల 15వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నేరేడ్మెట్లో వృద్ధుడు మిస్సింగ్
నేరేడ్మెట్ వివేకానందపురంలో నివసిస్తున్న ఎన్. సుధాకర్(70) అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. గతనెల 27న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతడి ఆచూకీ లభించకపోవడంతో కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆనంద్బాగ్లో యువతి.. అదృశ్యం
ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి కనిపించకుండా పోయింది. హిల్టాప్ కాలనీలో నివసిస్తున్న రేఖ(21) స్నేహితురాలి వద్దకు స్కూటీపై వెళ్లి తిరిగి రాలేదు. బీరువాలో చూడగా ఆమె దుస్తులు, నగదు, చెవిరింగులు, ఏటీఎం కార్డు, ఆధార్కార్డు లేకపోవడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. రేఖ ఆచూకీ లభించకపోవడంతో సోదరుడు హరీష్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.