17 నుంచి మద్యం దుకాణాల మూసివేత
ABN , First Publish Date - 2022-02-10T16:04:33+05:30 IST
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈనెల 17వ తేది నుంచి మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 19న రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు
ఐసిఎఫ్(చెన్నై): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈనెల 17వ తేది నుంచి మూడు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 19న రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. పోలింగ్ జరిగే ప్రాంతా ల్లో 17వ తేది ఉదయం 10 గంటల నుంచి 19వ తేది అర్ధరాత్రి 12 గంటల వరకు, ఓట్ల లెక్కింపు రోజైన 22వ తేది లెక్కింపు జరిగే ప్రాంతాల 5 కి.మీ పరిధిలో మద్యం విక్రయాలు నిషేధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు చేపడతామని ఈసీ హెచ్చరించింది.