బాలికపై ముగ్గురు సోదరుల సామూహిక అత్యాచారం.. పెళ్లికి హాజరు కావాలని చెప్పి బలవంతంగా..

ABN , First Publish Date - 2022-03-11T17:37:39+05:30 IST

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

బాలికపై ముగ్గురు సోదరుల సామూహిక అత్యాచారం.. పెళ్లికి హాజరు కావాలని చెప్పి బలవంతంగా..

రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు సోదరులు ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒక వ్యక్తి పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఒక 17 ఏళ్ల బాలిక పరిచయమైంది. ఆ బాలికతో అతను క్రమంగా పరిచయం పెంచుకున్నాడు. ఇటీవల తన ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరు కావాల్సిందిగా ఒత్తిడి చేశాడు. ఆమె రానంటున్నా బలవంతంగా తీసుకెళ్లాడు. 


అక్కడ ఆమెపై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ బాలికను తన సోదరుడికి అప్పగించాడు. అతను ఆమెను నెలన్నర రోజులు తనతో పాటు జోధ్‌పూర్‌లో ఉంచి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అతని మరో సోదరుడు కూడా ఆమెపై బలాత్కారానికి తెగబడ్డాడు. వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరిన బాలిక తన సోదరుడికి విషయం చెప్పింది. సోదరుడి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-03-11T17:37:39+05:30 IST