red alert: చైనాలోని మూడు జిల్లాల్లో కుంభవృష్టి
ABN , First Publish Date - 2021-07-27T16:19:15+05:30 IST
చైనా దేశంలోని మూడు జిల్లాలు మంగళవారం కుంభవృష్టితో అతలాకుతలమయ్యాయి....
బీజింగ్ (చైనా): చైనా దేశంలోని మూడు జిల్లాలు మంగళవారం కుంభవృష్టితో అతలాకుతలమయ్యాయి. ఈశాన్య బీజింగ్లోని మియున్ జిల్లాలో మంగళవారం ఉదయం 9 గంటలకు అత్యధిక వర్షం కురిసింది. చైనా రాజధాని నగరమైన బీజింగ్ ఉత్తర, తూప్పు భాగాల్లో ఉన్న షుని,పింగ్గు, మియున్ జిల్లాల్లో మంగళవారం రాత్రి 8గంటల వరకు అత్యధికంగా భారీవర్షం కురుస్తుందని మియూన్ జిల్లా వాతావరణ పరిశీలన కేంద్రం వెల్లడించింది. మియూన్ జిల్లా ముజియాయు స్టేషను వద్ద 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 200 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుందని బీజింగ్ జిల్లా అబ్జర్వేటరీ అధికారులు చెప్పారు. అత్యధిక భారీ వర్షాలతో బీజింగ్ పరిధిలోని మూడు జిల్లాల్లో చైనా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అతి భారీవర్షాల వల్ల వరదనీరు పొంగి ప్రవహిస్తోంది.