కళ్లల్లో కారం చల్లి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిన ముగ్గురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-05-18T17:56:35+05:30 IST

ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిన ముగ్గురు వ్యక్తులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

కళ్లల్లో కారం చల్లి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిన ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్/వనస్థలిపురం: ఓ వ్యక్తి కళ్లలో కారం చల్లి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లిన ముగ్గురు వ్యక్తులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హస్తినాపురం, అగ్రికల్చర్‌ కాలనీకి చెందిన కెతావత్‌ లోకేష్‌, శ్రీపురం కాలనీకి చెందిన మెగావత్‌ సంతోష్‌, ఇంజాపూర్‌, తుల్జాభవానీనగర్‌కు చెందిన మెగావత్‌ లక్కీదాస్‌ ఈ నెల 9న క్రిస్టియన్‌ కాలనీకి ఆటోలో వచ్చారు. అక్కడ నివాసముంటున్న సంతోష్‌ కళ్లలో కారం చల్లి సెల్‌ఫోన్‌ లాక్కెళ్లారు. సదరు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2022-05-18T17:56:35+05:30 IST