‘దళితులను హత్య చేసిన వారిని శిక్షించాలి’
ABN , First Publish Date - 2022-01-29T05:12:42+05:30 IST
కౌతాళం మండలం కామవరం గ్రామంలో దళితులను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు జేమ్స్ మాదిగ, మండల నాయకులు శ్రీనివాసులు మాదిగ డిమాండ్ చేశారు.
నంద్యాల(నూనెపల్లె), జనవరి 28: కౌతాళం మండలం కామవరం గ్రామంలో దళితులను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు జేమ్స్ మాదిగ, మండల నాయకులు శ్రీనివాసులు మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. భూ వివాదంలో రెండువర్గాల మధ్య జరిగిన ఘటనలో దళితులను హత్యచేయడం దుర్మార్గమన్నారు. బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు నష్టపరిహారం అందించి, 3ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నంద్యాల డిప్యూటీ తహసీల్దార్ రమాదేవికి ఎమ్మార్పీఎస్ నాయకులు వినతిపత్రం అంద జే శారు. కార్యక్రమంలో తిమ్మయ్య, ఫిలోమినా, శివ, ఉసేని, ప్రసాద్ పాల్గొన్నారు.