Manipurలో అసెంబ్లీ పోలింగ్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-02-28T12:47:43+05:30 IST
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది.మణిపూర్ లోని 38 సీట్లలో పోలింగ్ ప్రారంభమైంది....
మణిపూర్ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైంది.మణిపూర్ లోని 38 సీట్లలో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమయ్యే కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అభ్యర్థిని బహిష్కరించింది.సమస్యాత్మకమైన ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో గట్టి భద్రత మధ్య 38 స్థానాల్లో పోలింగ్ సాగుతోంది. మణిపూర్ లో బీజేపీ నేతృత్వంలోని కూటమి బహుముఖ పోటీలో రెండవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తోంది.మణిపూర్ జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.బీజేపీ, కాంగ్రెస్తో పాటు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా పోటీ చేస్తోంది.పోలింగ్ కేంద్రాల ముందు పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరారు.