పనులు నాణ్యతగా చేపట్టాలి
ABN , First Publish Date - 2021-05-12T06:49:46+05:30 IST
చెక్డ్యాం పనులు నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవోశేఖర్ అన్నారు.
కుభీర్, మే 11 : చెక్డ్యాం పనులు నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పూర్తి చేయాలని ఎంపీడీవోశేఖర్ అన్నారు. మంగళవారం మండలంలోని సాంగ్వీ గ్రామశివారులో చేపడుతున్న చెక్డ్యాం పనులను ఆయన పరిశీలించారు. వర్షాకా లం లోపు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రకృతి వనం నర్సరీలను పరిశీలించారు. నర్సరీల్లో మొక్కలు వంద శాతం పెరిగేలా చూసి హరితహారం కార్యక్రమానికి అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఈయన వెంట సర్పంచ్ దత్తుగౌడ్, వార్డు సభ్యులు తదితరులున్నారు.