‘జిల్లాలో మూడు కొవిడ్-19 ఆసుపత్రులు’
ABN , First Publish Date - 2020-03-28T10:15:01+05:30 IST
ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు
కాకినాడ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారించడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 3 ఆసుపత్రులను కొవిడ్-19 ప్రత్యేక ఆసుపత్రులుగా గుర్తించామని, ఆరోగ్యశ్రీ ట్రస్టు జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కె.మణిరత్నకిశోర్ తెలిపారు. ఇందులో రాజానగరం జీఎ్సఎల్ మెడికల్ కళాశాల, రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రి, అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల ఉన్నాయన్నారు.
ఆరోగ్య శ్రీ గుర్తింపు పొందిన నెట్వర్క్ ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు యథావిథిగా కొనసాగుతాయన్నారు. ఈ ఆసుపత్రుల్లో ఎక్కడైనా అత్యవసర సేవలకు నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని యాజమాన్యాలకు ఆయన సూచించారు. ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య ఆరోగ్య సేవల్లో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడినా తన నెంబరు 83333 814005, జిల్లా మేనేజర్ 83338 14006 నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చని తెలిపారు.